Tuesday 28 August 2012

ఆలుగడ్డ పచ్చి బటానీల కూర

కావలసిన పదార్థాలు :


ఆలుగడ్డలు - 500 గ్రాములు 
పచ్చి బటానీలు  - 200 గ్రాములు 
టమాటాలు - 3 
ఉప్పు - రుచికి సరిపడా 
కారం  - 2 చెంచాలు 
మసాల - 2 చెంచాలు 
పుదీనా - కొద్దిగా 
కొతిమీర - అర కప్పు 
నూనే  - 2 చెంచాలు 
తరిగిన ఉల్లిపాయలు - 2 
అల్లంవెల్లుల్లి - ఒక చెంచా 
పసుపు - కొద్దిగా 
ఆవాలు- కొద్దిగా 
జీలకర్ర - అర చెంచా 


తాయారు చేసే విధానం :

1) మొదటగా ఆలుగడ్డలు కడిగి 15 నిముషాలు ఉడుకనివ్వాలి , తరవాత తొక్క తీసి కావలసిన మాదిరిగా తరుముకోవాలి 
2) టమాటాలు , ఉల్లిపాయలు , కొతిమీర , పుదీనా  తరగాలి . బటానీలు ఒక గిన్నెలో  నానబెట్టాలి 
3) ఒక గిన్నెలో నునే వేడి చేసి ఆవాలు వేయాలి . తరవాత జీలకర్ర , ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి 
4) అల్లంవెల్లుల్లి వేసి పచ్చి  వాసన  పోయేదాకా వేగనివ్వాలి 
5) ఇప్పుడు బటానీలు వేసి కాసేపు ఉడికించుకోవాలి  ఆలు , టమాటాలు వేసి బాగా కలపాలి 
6) ఉప్పు , కారం , పసుపు పుదినా వేసి ఉడుకనివ్వాలి 
7) ఇదంతా బాగా ఉడికాక కొతిమీర , మసాల వేసి బాగా కలిపి దించుకోవాలి 

దీనిని రోటి , అన్నంతో , నాన్ తో తింటే చాల రుచిగా ఉంటుంది 

Sunday 29 July 2012

చింత చిగురు పప్పు


కావలసిన పదార్థాలు :

చింత చిగురు  - 2 కప్పులు
పెసరు పప్పు - 4 కప్పులు 
ఉప్పు - రుచికి సరిపడా 
కారం - ఒకటిన్నర చెంచా 
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - ఒకటి
అల్లంవెల్లుల్లి  - ఒక చెంచా 
జీలకర్ర  - అర చెంచా 
నూనే - 2 చెంచాలు
పసుపు - కొద్దిగా
కొతిమీర - అర కప్పు
పుదీనా - పావు కప్పు
గరం మసాల - ఒక చెంచా
కొతిమీర పొడి - ఒక చెంచా

తాలింపుకు కావలసిన పదార్థాలు :

నూనే  - కొద్దిగా
కరివేపాకు - 4 రెమ్మలు
పచ్చి మిర్చి - 2 (పొడువుగా చిల్చినవి )
ఆవాలు - కొద్దిగా
మెంతులు - 4


చింత చిగురు ఎంచుకోవడం :


చింత చిగురు లేతగా , పుల్లగా ఉండే విధంగా చూసుకోవాలి . దీనిలో పురుగులు లేకుండా చూసుకొని రెండు సార్లు మంచి నీటితో కడిగి పక్కన ఉంచుకోవాలి .





తయారు చేసే విధానం :

1) మొదటగా పెసరు పప్పు  కడిగి కనీసం 10 నిముషాలు  నానబెట్టాలి
2) ఒక కడాయిలో నూనే వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి సగం వరకు మగ్గాక అల్లం వెల్లుల్లి వేసి పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి
3) ఇప్పుడు చింత చిగురు వేసి పచ్చి  వాసన  పోయాక కారం  , ఉప్పు , పసుపు వేసి బాగా కలపాలి .
4) పెసరు పప్పు వేసి , కొతిమీర పొడి ,పుదీనా  , ఒక గ్లాసు నీళ్ళు  వేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి
5) ఇప్పుడు గరం మసాల , కొతిమీర వేసి, బాగా కలిపి  దించుకోవాలి .

తాలింపు :

ఒక చిన్న  గిన్నెలో నూనే  వేడి చేసి , ఆవాలు , మెంతులు ,జీలకర్ర ,పచ్చి  మిర్చి వేసి సగం వరకు మగ్గనివ్వాలి . కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని తాయారు చేసుకున్న పప్పు  పైన వేసుకుని వడ్డించుకోవాలి .

దీనిని  అన్నం , రొట్టెలతో తినవచ్చు 

Tuesday 3 July 2012

వంకాయ టమాట కూర

కావాల్సిన పదార్థాలు :




వంకాయలు - 500 గ్రాములు
టమాటాలు - 4 పెద్దవి
పచ్చి మిరపకాయలు  - 6 నుండి 10
పసుపు - కొద్దిగా
ఉప్పు  - రుచికి సరిపడా
నూనే  - 2 చెంచాలు
ఉల్లిపాయ - 1 పెద్దది
అల్లంవెల్లుల్లి  - అర చెంచా
జీలకర్ర - అర చెంచా
కొతిమీర పొడి - 1 చెంచా
మసాల - అర చెంచా
కొతిమీర - అర కప్పు

తయారీ  విధానం  :

1) మొదటగా పచ్చి మిరపకాయలు , టమాటాలు , ఉల్లిపాయలు  మంచి నీటితో కడిగి సన్నగా తరుముకోవాలి .

2) ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి  అర చెంచా ఉప్పు వేసి వంకాయలు పురుగులు లేకుండా చూస్తూ చిన్నగా తరుముతూ , ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి.

3) ఒక కడాయిలో నూనే  వేడి చేసి , జీలకర్ర  , మిర్చి , ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి వేసి బాగా కలిపి , వంకాయ ముక్కలు వేసి కలుపుతూ ఉండాలి..

4) వంకాయలు సగం వరకు ఉడికిన తర్వాత పసుపు , టమాటాలు  , కొతిమీర పొడి , ఉప్పు వేసి కలుపుకోవాలి . (ఉప్పు చాలా జాగ్రతగా  చూసి వేసుకోవాలి ,  వంకాయలు ఉప్పు నీళ్ళలో  కడిగాము  కావున తక్కువగా వేసుకోవాలి  )

5) చివరగా మసాల , కొతిమీర ఆకులు  వేసి బాగా కలిపి , దించుకోవాలి..

అంతే ఎంతో రుచికరమైన  వంకాయ టమాట  కూర  తాయారు చేసుకున్నాం. దీనిని   అన్నంతో , చపాతీ , రోటితో  తింటే చాల రుచిగా ఉంటుంది .


For English Versionhttp://kmshomemadefood.blogspot.in/2012/07/egg-plant-with-tomato-recipe-brinjal.html

Wednesday 23 May 2012

పెసరుపప్పు టమాట కూర(bachelor food)

టమాట పెసరుపప్పు  కూర చాల శులభంగా చేయవచ్చు . ముఖ్యంగా హాస్టల్లో ఉండే వాళ్ళు , ఉద్యోగం చేసుకునే వారు కూడా దీనిని చేసుకోవచ్చు.


కావలిసిన పదార్థాలు :

పెసరు పప్పు - రెండు  కప్పులు
టమాటాలు -నాలుగు (దోరగా పండినవి)
కారం - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
ఆవాలు - పావు  చెంచా
జీలకర్ర - పావు చెంచా
నూనే - రెండు చెంచాలు
మసాల - ఒక చెంచా
కొతిమీర పొడి - ఒక చెంచా
తరిగిన కొతిమీర - పావు కప్పు
కరివేపాకు - కొద్దిగా
అల్లంవెల్లుల్లి - అర చెంచా
పసుపు - కొద్దిగా(చిటికెడు)
తరిగిన ఉల్లిపాయ -ఒకటి

తయారుచేసే విధానం :

మొదటగా పప్పును మంచి నీటిలో కడిగి పది నిముషాలు నానబెట్టాలి . పప్పు నానేటప్పుడు ఉల్లిపాయలు , టమాటాలు తరగాలి. ఒక గిన్నె తీసుకుని నూనే వేడి చేసి , అందులో ఆవాలు . జీలకర్ర వేసుకోవాలి .అవి చిటపటలడగానే , తరిగిన ఉల్లిపాయలు , సగం ఉప్పు వేయాలి ఉల్లిపాయలు ముదురు గోధుమ రంగు రాగానే అల్లంవెల్లుల్లి వేయాలి   ఒక నిమిషం తర్వాత కరివేపాకు వేసి వెంటనే టమాట ముక్కలు వేసుకోవాలి
తరవాత కారం , పసుపు  వేసి అయిదు నిముషాలు సన్నటి మంట మిద ఉడుకనివ్వాలి.

ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు వేసి రెండో సగం ఉప్పు, కొతిమీర పొడి  వేసుకోవాలి  మరో అయిదు నిమిషాల తరవాత  మసాల ,తరిగిన  కొతిమీర వేసి దించుకోవాలి . పలచగా కావాలంటే పప్పు వేశాక ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు


అంతే పుల్లటి ఎంతో రుచిఅకరమైన టమాట పప్పు తయారైంది . దీనిని అన్నం లో కానీ , చపాతీలలో , ఉప్మా లో తినవచ్చు .
English Version :
http://kmshomemadefood.blogspot.in/2012/05/tomato-moong-dal-fry-bachelor-food.html

Thursday 17 May 2012

బెండకాయ చింత పులుసు కూర

కావలసిన  పదార్థాలు:

బెండకాయలు - 500 గ్రాములు
తరిగిన ఉల్లిపాయ - ఒకటి
అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక చెంచా
పచ్చి మిరపకాయలు - 2
పసుపు - చిటికెడు
కారం - 2 చెంచాలు
ఉప్పు  - రుచికి సరిపడా
కరివేపాకు - కొద్దిగా

కొతిమీర  -అర కప్పు
ధనియాలపొడి - పావు కప్పు
పుల్లటి చింత పండు- పావు కప్పు
నునే -  50 మి . లీ
ఆవాలు - అర చెంచా
జీలకర్ర - ఒక చెంచా
మెంతులు  - పావు చెంచా (ఎక్కువ అయితే చేదుగా ఉంటాయి ),
మసాల - ఒక చెంచా
నువ్వుల పొడి -అర కప్పు (అవసరమైతే  వేసుకోవచ్చు )

తయారు చేసే విధానం :


మొదటగా బెండకాయలు శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి (కత్తిరించుకోవాలి).  ఇలా  చిన్న ముక్కలుగా చేసుకునేటప్పుడు  ప్రతి ముక్క ను జాగ్రత్తగా , పురుగులు లేకుండా చూసుకోవాలి . ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు , కొతిమీర , కరివేపాకు కూడా కడిగి చిన్నగా తురుము కోవాలి . అలాగే ఒక చిన్న గిన్నె లో చింత పండు తీసుకుని , ఒకసారి నీళ్ళలో కడిగి కప్పు నిండా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి .

ఇప్పుడు ఒక కడాయిలో నునే వేడి చేసి ముందుగా ఆవాలు, జీలకర్ర , మెంతులు వేసి అవి చిటపట లాడగానే అల్లంవెల్లుల్లి  ముద్ద,, ఉల్లిపాయ ముక్కలు , పచ్చి  మిర్చి వేసుకోవాలి .దాని పైన సగం వరకు ఉప్పు వేసి మాడిపోకుండా జాగ్రతగా కలుపుతూ ఉండాలి .

ఇదంతా బాగా వేగాక బెండకయముక్కలు  వేసి 5 నుండి 10 నిముషాలు సన్నటి మంట మీద వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల జిగట పదార్థం అంతా ఆవిరైపోతుంది . తర్వాత పసుపు ,కారం , నువ్వు పొడి , ధనియాలపొడి  , రెండో సగం ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు బాగా కలపాలి . ననబెట్టుకున్న చింత పండు నుండి రసం పిండుకుని  బెండకయాలలో పోయాలి. ఈ మిశ్రమాన్ని  5 నిమిషాల పాటు మరగానివ్వాలి . దానిపై మసాల , కొతిమీర, కరివేపాకు వేసి ఒక నిమిషం మూత  పెట్టి ఉంచి , తరవాత దించుకోవాలి .

అంతే ఎంతో రుచికరమైన పుల్లపుల్లని  బెండకాయ చింత పులుసు కూర తయారైంది ....:)
For English Version:
http://kmshomemadefood.blogspot.in/2012/05/lady-finger-curry-with-tamarind-juice.html

Tuesday 15 May 2012

గుత్తివంకాయ నువ్వుల కూర

కావలసిన పదార్థాలు :





వంకాయలు 500 గ్రాములు
నువ్వులు 200 గ్రాములు
పచ్చి మిరపకాయలు 5
ఎండు మిరపకాయలు 10
ఉప్పు సరిపడా
నునే 100 మి లి
ఉల్లిపాయలు 2
అల్లంవెల్లుల్లి 2 చెంచాలు
ధనియాలపొడి అర కప్పు
మసాల ఒక చెంచా
కొతిమీర ఒక కప్పు
కరివేపాకు కొద్దిగా
పసుపు చిటికెడు

తయారి విధానం:


మొదటగా ఒక పెనం తీసుకుని దాని లో నువ్వులు దోరగా వేయించుకోవాలి(మాడిపోకుండా జాగ్రత్త పడాలి ) ఇప్పుడు ఎండు మిరపకాయలు ,కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి .ఇప్పుడు అలా వేయించుకున్న నువ్వులు, ఎండు మిరపకాయలు , కరివేపాకు  రోటిలో వేసుకుని కచ్చాపక్కగా దంచుకోవాలి.

 ఒక గిన్నె తీసుకుని అందులో దంచుకున్న నువ్వు పొడి , సగం ఉప్పు , మూడు పాళ్ళు అల్లం వెల్లుల్లి ,మూడు పాళ్ళు ధనియాల పొడి ,పసుపు , కొద్దిగా మసాల వేసుకుని  కొద్దిగా నునే కూడా వేసుకుని బాగా కలిపి ముద్దలా తాయారు చేసుకోవాలి.

ఇప్పుడు వంకాయలు పురుగులు లేనివి , లేతగా ఉండేవి ఎంచుకొని శుభ్రంగా కడిగి,కాండం వైపు కాకుండా మరో వైపు సగం కంటే ఎక్కువగా నాలుగు పాయలు వచ్చేలా కోయాలి . వాటిని వెంట వెంటనే ఉప్పు నీటిలో వేయాలి లేక పోతే చెదుగా అవుతాయి .(పాయలు విడిపోకుండా చూసుకోవాలి )


ఒక్కొక్క వంకాయ తీసుకుని నీళ్ళు లేకుండా ఒక గుడ్డతో తుడిచి ఇందాక తాయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వంకాయ పాయల మధ్య అమర్చుకోవాలి . మిశ్రమం ఉడి పోకుండా సన్నటి దారం  కూడా కట్టుకోవచ్చు.

ఇప్పుడు ఒక లోతైన కడాయి తీసుకుని అందులో నునే కాచుకొని , అందులో  ఉల్లిపాయ ముక్కలు , అల్లం వెల్లుల్లి ,పచ్చి మిరపకాయ ముక్కలు , వేసుకొని ముదురు గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .ఇప్పుడు తాయారు చేసుకున్న వంకాయలు వేసుకుని  సన్నని మంట మీద 5 నిముషాలు ఉడికించుకోవాలి.

ఇప్పుడు మిగిలిన ఉప్పు , ధనియాల పొడి, కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి సన్నని మంట పైన 10 నిముషాలు ఉడికించుకోవాలి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి బాగా కలిపి మల్లి మూత పెట్టాలి .తర్వాత కరివేపాకు , కొతిమీర తురుము , మసాల వేసుకుని రెండు నిమిషాల తర్వాత దించుకోవాలి



అంతే నోరూరించే ఎంతో రుచికరమైన  గుత్తివంకాయ నువ్వుల  కూర తయారైంది . స్నాక్స్ లాగా తినాలనుకునే వాళ్ళు   నీళ్ళు తక్కువగా వేసుకుని మాడిపోకుండా అన్ని వైపులా జాగ్రతగా ఉడికించుకోవాలి .


For English Version :           

Friday 11 May 2012

సిమ్లా మిర్చి(కాప్సికం ) నువ్వుల కూర

కావాల్సిన పదార్థాలు :

సిమ్లా మిర్చి  10
నువ్వులు 150  గ్రాములు
పచ్చి మిరపకాయలు 5
ఎండు మిరపకాయలు 10
ఉప్పు సరిపడా
నూనే  100 మి లీ
ధనియాల పొడి రెండు చెంచాలు
కోతిమెర ఒక కట్ట
ఉల్లిపాయ ముద్ద 2 చిన్నవి
అల్లం వెల్లుల్లి 2 చెంచాలు
పసుపు కొద్దిగా
జీలకర్ర ఒక చెంచా
ఆవాలు కొద్దిగా
మెంతులు 10 (ఎక్కువగా వేసుంటే చెదు  వస్తాయి)
మసాల ఒక చెంచా
కరివేపాకు ఒక రెమ్మ

 మొదటగా నువ్వుల పిండి తయారు చేసుకోవాలీ.  కావాల్సిన నువ్వులలో  చెత్త లేకుండా చూసుకొని మంచి నీటి లో కడగాలి , ఇలా కదిగిన నువ్వులను నీడలో 5  నిముషాలు ఆరనివ్వాలి అలా చేయడం వల్ల నీళ్ళు అవిరైపోతాయి
 ఇప్పుడు ఒక  పెనం తేసుకుని స్టవ్ మీద పెట్టి  సన్నని మంట పైన నువ్వులు  పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి  మాడిపోకుండా ఎప్పుడు కలుపుతుండాలి. ఇలా  రెండు నిముషాలు అయ్యాక ఉవ్వులు గిన్నెలోకి తీసుకోవాలి .

తర్వాత అదే పెనం పైన  ధనియాలు , ఎండు మిరపకాయలు ,మెంతులు , ఆవాలు ,కరివేపాకు ఒక నిమిషం పాటు సన్నని మంట పిన వేగనివ్వాలి . ఇలా వేయించుకున్న అన్నిటిని రోటిలో వేసి దంచుకోవాలి, నువ్వులు కూడా బాగా దంచుకోవాలి . ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో  ధనియాల పొడి ,   తాయారు చేసుకున్న మిశ్రమం , పసుపు , సగం ఉప్పు , అల్లం వెల్లుల్లి , సగం ఉల్లిపాయ ముద్ద  , కొద్దిగా నూనే వేసుకుని ముద్దలాగా చేసుకోవాలి ,

 సిమ్లా మిర్చి బాగా కడిగి ఒక టవల్ తో నీటిని తుడవాలి . కాండం వైపు కాకుండా మరో వైపు రెండు  గాట్లు పెట్టుకోవాలి (సగం కంటే ఎక్కువ పెట్టుకోవడం వల్ల తాయారు చేసుకున్న మిశ్రం  పెట్టుకోవడానికి సరిపడా  స్తలం ఉంటుంది ).

ఒక కడాయిలో నూనే వేసుకుని జీలకర్ర , ఆవాలు , మెంతులు , అల్లంవెల్లుల్లి , పచ్చిమిరపకాయ ముక్కలు , ఉల్లిపాయ ముద్ద వేసుకుని రెండు నిముషాలు  ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి .  వెంటనే  సిమ్ల మిర్చి వేసుకుని , పైన ఉప్పు చల్లుకోవాలి  .

 సన్నని మంట  మీద వేయించుకోవాలి  15 నిముషాలు సన్నని సెగ మెడ ఉడకనివ్వాలి , తరవాత మసాల , కోతిమెర చల్లుకొని దించుకోవాలి ..

 వేడివేడిగా వడ్డించు కోవాలి  ఇది అన్నలో  ఎంతో రుచిగా ఉంటుంది  స్నాక్స్ లా తినాలంటే పూర్తిగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి .......
 FOR ENGLISH VERSION:
 http://kmshomemadefood.blogspot.in/2012/05/sesame-seed-stuffed-capsicum-curry.html

Wednesday 9 May 2012

తోటకూర పప్పు



పోషక విలువలు :
ప్రతి 100  గ్రాములో
పొటాషియం 641 మి గ్రా
కాల్షియం 209 మి గ్రా
పాస్పరస్ 72 మి గ్రా
మెగ్నీషియం 55   మి గ్రా
 సోడియం 21   మి గ్రా
ఇనుము  2.3 మి గ్రా
ఇంకా జింక్ , కాపర్ ,మాంగనీస్ , ఫ్లోరిన్  కొద్ది మోత్డులలో ఉంటాయి

విటమిన్లు:

ప్రధానంగా  విటమిన్   A, C , B6 ,  ఫోలేట్ , నియాసిన్ , థయామిన్  కూడా ఉంటాయి
 ప్రోటీన్లు , అమినో ఆమ్లాలు  2.1 గ్రా ;

 ఉపయోగాలు :

మంచి విరోచానాకరి ,జీర్ణశక్తిని పెంపొందిస్తుంది ,ఆకలిని పుట్టిస్తుంది, రక్తహీనతకు మంచి విరుగుడు , ఎముకలు బలంగా చేస్తుంది , కాలేయ సంబందిత రోగాలకు కూడా పని చేస్తుంది , గుండె జబ్బు వాళ్ళకు మంచి సహాయకారి , వారానికి రెండు సార్లు తినేవారికి  మలబద్దకం దరి చేరదు.

కావాల్సిన పదార్థాలు :




తోటకూర 2 కట్టలు (500 గ్రాములు)
పెసరు పప్పు 100 గ్రాములు
నూనే 50 మి లీ
పచ్చిమిరపకాయలు ౮
అల్లంవెల్లుల్లి 50 గ్రాములు
తరిగిన ఉల్లిపాయలు 2 చిన్నవి
జీలకర్ర ఒక చెంచా
ఆవాలు కొన్ని
మెంతులు 10
ధనియాల పొడి 2 చెంచాలు
కారం ఒక చెంచా
ఉప్పు రుచికి సరిపడా
మసాల ఒక చెంచా

తయారు చేసే విధానం :


మొదటగా పెసరు పప్పును శుబ్రంగా కడిగి 10 నిముషాలు నానబెట్టాలి. ఇప్పుడు పురుగులు లేకుండా చూసుకుని  మంచి నీటిలో కడిగి సన్నగా తురుము కోవాలి . మిరపకయాలలో కొద్దిగా ఉప్పు వేసి రోటిలో కచ్చా పక్కాగా  దంచుకోవాలి .
స్టవ్ వెలిగించి ఒక గిన్నె లో నూనే పోసి వేడిచేసుకోవాలి , నూనే వేడి అయ్యాక ఆవాలు , మెంతులు , జీలకర్ర వేసి  కొద్ది సేపట్లోనే తరిగిన ఉల్లిపాయలు , అల్లంవెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాల పాటు సన్నని మంట ఫై వేగనివ్వాలి. ఇప్పుడు సగం ఉప్పు , కారం వేసి పూర్తిగా కలియబెట్టి సన్నగా తిమిన ఆకులూ వేసుకొని , మూత  పెట్టి  రెండు నిముషాలు మగ్గనివ్వాలి . ఇప్పుడు  దంచిపెట్టుకున్న పచ్చి కారం , మరో సగం ఉప్పు ,ధనియాల పొడి వేసి పెసరు పప్పు వేసుకోవాలి . అంత బాగా కలిపి ఇంకో అయిదు నిమిహాలు ఉడికించుకొని , దించి మసాల వేయాలి .
అంతే ఘుమఘుమలాడే ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన  తోటకూర పప్పు తయారైనది.
దీనిని అన్నం లో కానీ , చపతిలలో కానీ వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది
 English version :http://kmshomemadefood.blogspot.in/2012/05/amaranth-leaves-and-moong-dal-fry.html

Tuesday 8 May 2012

మామిడికాయ పానకం

మామిడికాయలు ఎండాకాలంలో దొరికే ఒక అత్యద్బుతమైన ఫలాలు ,  ఇది దేవుడు సృష్టించిన అత్యద్భుతాలలో ఒకటి. మండే వేసవిలో దొరికే ఆపన్నహస్తం మామిడి పండ్లు , వాటిన రసాలు . మన దేశం లో మామిడి పండును పండ్ల రారాజు  అంటారు

ఉపయోగాలు :
మామిడికాయ బెరడు మరియు టెంక  లోపలి జీడి ని  ఔషధాలలోను ఉపయోగిస్తున్నారు .

పోషక విలువలు :


ప్రతి 100 గ్రాములలో
కాల్సియం  14 మి.గ్రా
ప్రోటీన్లు 0.6 శాతం
పిండి పదార్థాలు 16.9 శాతం
ఇనుము 1.3 మి గ్రా
విటమిన్  సి

బాగా పండిన పండ్లలో  చక్కర శాతం కూడా ఎక్కువే . కానీ పచ్చిగా ఉండే కాయలలో మాత్రం  విటమిన్ సి ఎక్కువ అన్నిటికంటే గొప్ప విషయం ఇది  లావేక్కడానికి సహాయ పడుతుంది. మిమిదికాయ ముక్కలకు ఉప్పు చేర్చి తినడం వల్ల  చెమట వలన వచ్చే అలసట తగ్గుతుంది . రోజు ఒక మిమిది పండు తిని గ్లాసు పలు తాగితే బరువు కూడా పెరుగుతారు . ఇవి జీర్ణశక్తిని పెంచి ఆకలి కలిగేల చేస్తాయి , సన్నగా ఉండే వారికీ ఎంతో ఉపయోగకరం. ఇందులో విటమిన్ ఎ  కూడా ఉంటుంది దేని వలన కంటి చూపు మండగించకుండా ఉంటుంది ..
ఇన్ని ఔషద గుణాలున్న ఫలాలను మనం కచ్చితంగా తిని తీరలి ...:)

మామిడికాయ పానకం :

కావాల్సిన పదార్థాలు :


మామిడికాయలు  500 గ్రాములు
చిక్కటి పాలు 100 మి లీ
యాలకులు 5
చెక్కర 100 గ్రాములు
నీళ్ళు ఒక గ్లాసు
పచ్చి కొబ్బరి తురుము  100 గ్రాములు


 పానకం తాయారు చేసే విధానం :


 మొదటగా అప్పుడే తీసిన చిక్కటి పాలలో కొన్ని నీళ్ళు (రెండు పాళ్ళ పాలకు ఒక  వంతు నీళ్ళు ) పోసుకుని చెక్కర వేసుకొని 15 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి ఇలా చేయడం వాళ్ళ పాల పచ్చి  వాసన పోతుంది . ఇప్పుడు బాగా పండిన మామిడికాయలను శుబ్రంగా కడిగి తొక్క  తీసి రసం పిండుకోవాలి . ఒక కొబ్బరి తీసుకుని చాల సన్నగా తురుమువుకోవాలి . అలాగే యాలకులు కూడా నలగోట్టుకోవాలి  ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోని దానిలో మామిడి పండ్ల రసం , కొబ్బరి , కాచిన పాలు ,  యాలకుల పొడి , నీళ్ళు (కొబ్బరి నీళ్ళు కూడా వాడుకోవచ్చు)  వేసుకొని బాగా కలియబెట్టాలి .

 ఏంతో రుచికరమైన  మామిడికాయ పానకం తయారైంది .

దీనిని  పూరీలతో గాని , చపాతిలతో  గాని వెన్నేలో కాల్చుకున్న బ్రెడ్ తో గని తింటే ఎంతో రుచికరం గా ఉంటుంది .
 సాయంత్రం చేస్తే పల్లాలు ఎంతో ఇష్టంగా తింటారు . అంటే కాకుండా ఎన్నో పోశాక విలువలు ఉన్నాయ్ కాబట్టి  ఆరోగ్యానికి కూడా మంచిది ...
   for english version 
http://kmshomemadefood.blogspot.in/2012/05/mango-special-juice.html